నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న కార్మికుడు మృతి...

by Sumithra |
నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న కార్మికుడు మృతి...
X

దిశ, కూకట్ పల్లి : నిర్మాణ సంస్థలో పని చేస్తుండగా మట్టి కుప్ప పడి ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. కూకట్ పల్లి రంగాధాముని ఆలయం సమీపంలో హానర్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనులలో పని చేస్తున్న రవి కుమార్ (20) కేబుల్ వైర్ గురించి తీసిన గుంతలో దిగాడు.

ఆ తర్వాత కట్ అయిన కేబుల్ కోసం గాలిస్తుండగా పైన ఉన్న మట్టి కుప్పలు రవికుమార్ పై పడటంతో రవి కుమార్ కు తీవ్ర గాయాలపాలయ్యాడు. అక్కడే పని చేస్తున్న రవి కుమార్ తండ్రి కిషోర్ రామ్, తోటి కార్మికులతో కలిసి రవి కుమార్ ను ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు. రవి కుమార్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్ పల్లి పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ కొత్తపల్లి ముత్తు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed