వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం.. పురుగుల మందు తాగి యువకుడి బలవన్మరణం

by Shiva |
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం.. పురుగుల మందు తాగి యువకుడి బలవన్మరణం
X

దిశ, రాయపర్తి: జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని పెరికవేడు గ్రామంలోని శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ధర్మారం యాకయ్య, ఉపేంద్రల కుమారుడు మణికంఠ (18) శుక్రవారం మధ్యాహ్నం అన్నారం గ్రామంలోని ఓ ఫెర్టిలైజర్ షాపులో గడ్డి మందు కొనుగోలు చేశాడు. అనంతరం పెరికవేడు గ్రామ శివారులోకి వచ్చి గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం బండిపై ఇంటి వెళ్లి తాను గడ్డి మందు తాగానని తల్లిదండ్రులకు చెప్పాడు. కుటుంబ సభ్యులు వెంటనే మణికంఠను చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ మణికంఠ శనివారం ఉదయం మృతి చెందాడని వారు పేర్కొన్నారు. మృతుడి తండ్రి ధర్మారం యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై శ్రావణ్ కుమార్ దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed