నీటి గుంతలో పడి బాలుడు మృతి

by Kavitha |
నీటి గుంతలో పడి బాలుడు మృతి
X

దిశ, చిన్నకోడూరు : మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కమ్మర్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బైకాన్ వేణు రేణుకల కుమారుడు రుద్రాన్స్ ( 3) ఆడుకుంటూ ఇంటి ముందు నిర్మించుకున్న నీటి తోటలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు తొట్టిలో నుండి తీసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సిద్దిపేట లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. వేణు రేణుకలకు ముగ్గురు ఆడపిల్లలు. కుమారుడు మృతి చెందడంతో వేణు, రేణుకలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామంలో చిన్న బాబు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed