విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్​...ఒకరు మృతి

by Sridhar Babu |
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్​...ఒకరు మృతి
X

దిశ, శామీర్ పేట : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్వాల్ బొల్లారం ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్య ( 44), నరసింహులు (46) ద్విచక్ర వాహనంపై నగరంలోని బొల్లారం నుంచి బాబాగూడ వైపు వస్తున్నారు.

బాబాగూడ శివారు ప్రాంతంలో వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బ్రహ్మయ్యకు బలంగా దెబ్బలు తగలగా, నరసింహకు కూడా గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే బ్రహ్మయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనాథ్, ఎస్సై హారిక తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed