నవంబర్ 14 నుంచి క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ

by Sridhar Babu |
Minister-Srinivas-goud1
X

దిశ, తెలంగాణ బ్యూరో: ద 100 లీగ్ పేరుతో హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో నవంబర్ 14 నుంచి క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుందని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ట్రోఫీకి సంబంధించిన బ్రోచర్ ను బుధవారం హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. ట్రోఫీని నిర్వహిస్తున్న నిర్వహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వాహకుడు చైతన్య, నెక్స్ట్ క్లబ్ ప్రతినిధులు సాత్విక్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed