- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో 10 వేల పడకలతో నిర్మితమైన దేశంలోనే అతిపెద్ద కొవిడ్ కేంద్రాన్ని మూసేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రాన్ని కరోనా లక్షణాలు లేనివారు, స్వల్పంగా లక్షణాలను కలిగిన వారికి చికిత్స అందించడానికి ఏర్పాటు చేశారు. తాజాగా స్వల్పంగా లక్షణాలను కలిగిన వారు హోమ్ ఐసోలేషన్లో ఉండటానికి కేంద్రం అనుమతులివ్వడంతో ఈ కొవిడ్ కేంద్రంలో చేరే వారి సంఖ్య తగ్గిపోయింది.
ఈ నేపథ్యంలో దీన్ని ఈ నెల 15వ తేదీ నుంచి మూసేయాలని బెంగళూరు మహానగర పాలిక అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి సెప్టెంబర్ 4న ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. మరోవైపు కరోనా కేసుల విజృంభన అధికమవుతున్న ఈ సమయంలో అతిపెద్ద కొవిడ్ కేంద్రంగా ఉన్న దీన్ని మూసేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం దీన్ని మూసేయడానికే మొగ్గు చూపుతోంది. అలాగే, ఈ కేంద్రంలో ఉన్న పడకలు, డస్ట్బిన్లు, ఇతర వస్తువులను ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతి గృహాలకు అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు.