పోలీసులు, మవోల మధ్య ఎదురు కాల్పులు

by  |
పోలీసులు, మవోల మధ్య ఎదురు కాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: గత నెల రోజులుగా తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్‌ఘడ్ అడవుల్లో పోలీసులు, మవోయిస్టుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తరుచూ కాల్పులకు దిగుతున్నారు. తాజాగా గురువారం సాయంత్రం ఛత్తీస్‌గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. మన్‌కేలి అడవుల్లో పోలీసులు, మవోయిస్టుల మధ్య ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మవోయిస్టులకు తీవ్రగాయాలు అయినట్లు పోలీసుల వర్గాల సమాచారం. కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసులు భారీగా ఆయుధాలు, సామగ్రి స్వాధీనం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Next Story