నిర్మల్‌లో ఆరోగ్య సిబ్బందికి కరోనా

by  |
నిర్మల్‌లో ఆరోగ్య సిబ్బందికి కరోనా
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఆరోగ్య సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆరోగ్య శాఖలో పని చేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కుభీర్ పీహెచ్ సీ లో పనిచేస్తున్న ఆరోగ్య పర్యవేక్షకుడు, మామడలో పనిచేసే మరో ఆరోగ్య కార్యకర్త కరోనా బారిన పడ్డారు. వీరిని హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. కాగా తాజాగా ఆరోగ్య సిబ్బందికి పాజిటివ్ రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


Next Story

Most Viewed