కలెక్టర్ సహా పలువురు అధికారులకు కరోనా

by  |
కలెక్టర్ సహా పలువురు అధికారులకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ కొలికోడ్ విమాన ప్రమాదంలో సహాయ చర్యల్లో పాల్గొన్న కలెక్టర్ సహా పలువురు అధికారులకు కరోనా సోకింది. కొవిడ్ 19 కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఇండియన్స్‌ను స్వదేశానికి తీసుకువచ్చే వందే భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 184మందితో దుబాయ్ నుంచి బయల్దేరిన విమానం కొలికోడ్ ఎయిర్ పోర్టులో టేబుల్ టాప్ రన్ వే పై ల్యాండ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి ఇద్దరు పైలట్లు సహా 19మంది ప్రాణాలుకోల్పోయారు. ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న మల్లపురం జిల్లా కలెక్టర్ గోపాల కృష్ణన్‌తో పాటు 22మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.


Next Story

Most Viewed