దేశంలో 36లక్షలు దాటిన కేసులు

by  |
దేశంలో 36లక్షలు దాటిన కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తోంది. ఒక్కరోజే 78వేల కేసులు నమోదు కాగా, వీటిలో 43శాతం కేసులు మూడు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకలో ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తుండగా మొత్తం మరణాల్లో 50శాతం ఇక్కడే నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోనే 30శాతం మరణాలు ఉన్నాయి. 24గంటల్లో 70శాతం కేసులు ఏడు రాష్ట్రాల్లో ఉన్నట్లు హెల్త్‌ బులెటిన్ తెలిపింది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 21శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 13.5శాతం, కర్ణాటకలో 11.27 శాతం, తమిళనాడులో 8.27శాతం పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వివరించింది.


Next Story

Most Viewed