కరోనా పాజిటివ్ వయా మణికొండ

by Shyam |
కరోనా పాజిటివ్ వయా మణికొండ
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో 36 కేసులున్నట్లు చెప్పిన గంట వ్యవధికే మరో కేసు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 37కు చేరుకుంది. తాజా పాజిటివ్ పేషెంట్ మణికొండలో నివాసం ఉంటున్న 64 ఏళ్ళ మహిళగా తేలింది. ఒక పాజిటివ్ పేషెంట్ ఈమెకు ఇది అంటుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. ఈ నెల 14వ తేదీన స్వీడన్ నుంచి విమానం ద్వారా హైదరాబాద్ చేరుకున్న ఒక వ్యక్తి (పేషెంట్ నెం. 25) ద్వారా ఇది మహిళకు సోకినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 114 మంది అనుమానితులు ఉన్నందున బుధవారం సాయంత్రానికే వచ్చే మెడికల్ రిపోర్టుతో ఇందులో ఎంతమంది పాజిటివ్‌గా నిర్ధారణ అవుతారో స్పష్టమవుతుంది.

Advertisement

Next Story

Most Viewed