17 లక్షలు దాటిన కరోనా కేసులు

by  |
17 లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కేసులు 17 లక్షల మార్క్ ను దాటాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 54,736 కొత్త కేసులు, 853 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 17 లక్షల 50 వేల 724 కు చేరింది.

ఇందులో 11,45,630 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారు. 5,67,730 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 37,364 మంది కరోనా బారిన పడి మృతిచెందారు.



Next Story