ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన

by Anukaran |
ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. విజయవాడలో శుక్రవారం ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ నిర్వహించారు. కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. గత ప్రభుత్వం విజయవాడలో కూల్చి వేసిన తొమ్మిది ఆలయాలను పునఃనిర్మించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed