విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న నాని లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

by Kavitha |
విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న నాని లేటెస్ట్ మూవీ..  స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’(Saripodhaa Sanivaaram). ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ(Vivek Athreya) తెరకెక్కించగా.. డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మించారు. ఇక ఈ మూవీలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Mohan) హీరోయిన్‌గా నటించింది. ఇక ఎస్‌జే సూర్య(SJ Surya) ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఆ చిత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్‌గా విడుదలై రూ. 100 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది . అందుకు సంబంధించిన విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారిక ప్రకటన చేసింది.

ఇదిలా ఉంటే.. నాని నటించిన సరిపోదా శనివారం మూవీ సెప్టెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. విడుదలైన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఒక్క హిందీలో తప్ప తెలుగుతోపాటు మిగతా అన్ని భాషల్లోనూ ఈ సరిపోదా శనివారం మూవీ సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story