- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అక్కినేని నాగార్జున-అమల మధ్య విభేదాలు.. దూరంగా ఉండటంతో బయటపడ్డ అసలు నిజాలు !
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగార్జున, వెంకటేష్ చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. వారికి నాగచైతన్య పుట్టాక ఏవో కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నాగ్ అమలను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి అఖిల్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే వీరిద్దరు టాలీవుడ్ ఆదర్శనీయమైన సెలబ్రీటీ కపుల్స్లో ముందుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి నాగార్జున-అమల మధ్య ఒకానొక సమయంలో విభేదాలు తలెత్తినట్లు స్వయంగా అమల ఓ ఇంటర్వ్యూలో చెప్పి షాకిచ్చింది.
అసలు విషయంలోకి వెళితే.. నాగార్జున-అమల మధ్య కుక్కల కారణంగా గొడవ వచ్చిందట. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఒకానొక సమయంలో మా ఇంట్లో చాలా ఇండియన్ కుక్కలు ఉండేవి. అయితే నాగార్జున ఒకసారి లాబ్రడార్ జాతికి చెందిన దాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఆయన చాలా ఇష్టపడేవారు. ఆయన షూటింగ్ నుంచి ఇంటికి రాగానే ఆ కుక్క గమనించి పరుగెత్తుకుంటూ వెళ్లి తీసుకొచ్చేది. సెట్లో వర్క్ చేసి అలసిపోయి వచ్చినా సరే ఆ కుక్కతో టైమ్ స్పెండ్ చేసేవారు. అది మాత్రం ఇంటికి వచ్చిన వాళ్ల మీద పడిపోయేది. దీంతో దాన్ని చూసి అందరూ భయపడిపోయి ఇంటికి రాకపోయేవారు.
ఈ క్రమంలోనే నేను ఆయనకు చెప్పకుండా ఆ కుక్కను ట్రైనింగ్కు పంపించాను. ఇక నాగార్జున ఇంటికి వచ్చాక దాని గురించి అడిగారు. దీంతో నేను జరిగింది చెప్పాను. ఆయన చాలా బాధపడిపోయారు. దాంతో మా ఇద్దరి మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయి. ఆ కుక్క కారణంగా నాగార్జున నా మీద కోపంతో నెలపాటు దూరంగా ఉన్నాడు. అప్పుడు బాధగా అనిపించినా.. ఇప్పుడు అదొక ఫన్నీ ఇన్సిడెంట్ లా అనిపిస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమల కామెంట్స్ మరోసారి వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.