పవన్ కల్యాణ్ చేసిన తప్పుకు వారికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి.. అసలు ఏం జరిగిందంటే?

by Hamsa |   ( Updated:2023-08-03 09:49:26.0  )
పవన్ కల్యాణ్ చేసిన తప్పుకు వారికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి.. అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ఫ్యామిలీలో స్టార్ హీరోలైన చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే పవన్ కల్యాణ్ చేసిన తప్పు వల్ల చిరంజీవి ఓ వ్యక్తిని క్షమాపణలు కోరారని ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. చిరంజీవి ఒకప్పుడు చెన్నైలో ఇల్లు కొని కుటుంబం మొత్తాన్ని అక్కడికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ రౌడీ మూక ఆయనను అసహ్యంగా అవమానించారట.

అయినా అవన్నీ పట్టించుకోకుండా సున్నత మనస్కుడైన చిరంజీవి సైలెంట్‌గా వెళ్లిపోయేవాడట. ఆ విషయాన్ని చిరంజీవి కార్ డ్రైవర్ పవన్ కల్యాణ్‌కు చెప్పడంతో అన్నకి తెలియకుండా వాళ్ల దగ్గరకు వెళ్లాడట. మా అన్నయ్యను ఎందుకలా అంటున్నారు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అన్నాడట. కానీ వారు నువ్వు ఏమైనా తోపా అంటూ గొడవకు దిగడంతో కుప్ప స్వామి అనే వ్యక్తికి పవన్ వల్ల గాయాలయ్యాయ్యట. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి హుటాహుటిన హాస్పిటల్‌కి వెళ్లి మా తమ్ముడు చేసిన తప్పుకు నేను సారీ చెబుతున్నాను అంటూ హాస్పిటల్ ఖర్చులకు వారికి డబ్బులు ఇచ్చి మరీ ఇంటికి వెళ్లాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More..

పవన్ కల్యాణ్‌ నాతో పిల్లల్ని కను.. వారిని రాజకీయాల్లోకి పంపిద్దాం: శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!

Advertisement

Next Story

Most Viewed