- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఇండియాలో.. వెహికల్ రీమాడిఫికేషన్స్ కాస్త ఎక్కువగానే జరుగుతుంటాయి. రిక్షాలకు, కార్గో ట్రై సైకిళ్లకు వెహికల్ మోటార్ అటాచ్ చేసేసి కొత్త రకం బైక్లకు ప్రాణం పోస్తుంటారు. మెకానిక్స్ ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రయత్నాలు చేయడం సాధారణమే. కానీ, చండీఘర్కు చెందిన ఓ పదో తరగతి కుర్రాడు గౌరవ్.. వివిధ రకాల బైక్ పార్ట్స్తో మరో బైక్ను తయారుచేశాడు. తన టాలెంట్కు ఫిదా అయిన నెటిజన్లు గౌరవ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
గౌరవ్ రూపొందించిన బైక్ భలే వినూత్నంగా ఉంది. పెట్రోల్తో నడిచే ఈ బైక్.. యావరేజ్గా లీటరుకు 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెబుతున్నాడు. బైక్ ముందు భాగంలో సైకిల్ టైరు బిగించడంతో యూనిక్ లుక్ వచ్చింది. అంతేకాకుండా పలు రకాల బైక్ పార్ట్స్ మిక్స్ చేయడంతో ఇంకాస్త డిఫరెంట్గా కనిపిస్తోంది. దాంతో ఈ బైక్ రోడ్ల మీద కంటే.. నెట్టింట్లోనే ఎక్కువగా చక్కర్లు కొడుతోంది. అయితే, గౌరవ్ బైక్ రూపొందించడం ఇదేం తొలిసారి కాదు. మూడు సంవత్సరాల క్రితం కూడా స్క్రాప్ పార్ట్స్తో ఎలక్ట్రిక్ బైక్ రూపొందించడం విశేషం.
Read Also…