పిల్లి ఎంత పని చేసింది…

by  |
పిల్లి ఎంత పని చేసింది…
X

దిశ వెబ్ డెస్క్: రెండేండ్ల చిన్నారి మరణానికి ఓ పిల్లి కారణమైంది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. చెన్నైలో నివవిస్తున్న దంపతులకు ఓ పాప ఉంది. ఆ పాప ఆటపాటలతో ఆ ఇల్లంతా సందడి సందడిగా ఉండేది. ఎప్పటిలాగే శనివారం సాయంత్రం కూడా ఆ పాప తన అల్లరితో సందడి చేసింది. ఆ తర్వాత అలసి నెమ్మిదిగా నిద్రలోకి జారుకుంది. దీంతో పాపను వేరే గదిలో పడుకోబెట్టి తల్లిదండ్రులు వారి పనిలో నిమగ్నమయ్యారు.

అయితే ఈ లోగా ఆ గదిలోకి పిల్లి వచ్చింది. అటు ఇటు ఎగురుతూ ఆఖరికి టీవీ స్టాండ్ పై దూకింది. దీంతో పక్కనే నిద్రపోతున్న పాపపై టీవీ పడింది. కాగా పాపకు తీవ్రగాయాలయ్యాయి. కాగా గాయాల పాలైన పాపను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. కానీ పాప అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలపడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed