- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
అజాగ్రత్త, అతివేగం.. ప్రాణం తీసింది..
దిశ, నిజామాబాద్ రూరల్: డిచ్పల్లి మండలంలోని సామ్పల్లి తాండా వద్ద గల జాతీయ రహాదారి పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేష్ (31) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్ కు చెందిన నరేష్ , అశ్విన్, గంగ కుమార్, హరీష్, రామ్ గిరి రాములు కలిసి ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్ట్ ను సందర్శించడానికి ఆదివారం ఉదయం శాంట్రో కార్లో బయలుదేరి వెళ్లారు.
44 నెంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సందర్భంగా ఎదురుగా వస్తున్న మరో కారు డ్రైవరు అజాగ్రత్త, అతివేగం కారణంగా సామ్ పల్లి తాండా మూలమలుపు వద్ద నరేష్ ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో శాంట్రో కారులో ప్రయాణిస్తున్న నరేష్ అనే యువకుడు కారు నుంచి ఎగిరిపడి తలకు బలమైన గాయాలయ్యాయి. నరేష్కు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్ఐ పేర్కొన్నారు. స్థానికుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నరేష్ మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నరేష్ భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.