- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వరుస ఆరు రోజుల లాభాలకు బ్రేక్

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్ పడింది. బుధవారం ట్రేడింగ్లో సూచీలు ఉదయం లాభాలతో ర్యాలీ ప్రారంభించినప్పటికీ మిడ్-సెషన్ నుంచి బలహీనపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు క్షీణించాయి. వరుస ఆరు రోజుల ర్యాలీలో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. అధిక వాల్యుయేషన్ వద్ద రిస్క్ తీసుకునేందుకు వెనుకాడటంతో మార్కెట్లలో ఒత్తిడి కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 434.31 పాయింట్లు పతనమై 71,623 వద్ద, నిఫ్టీ 141.90 పాయింట్లు క్షీణించి 22,055 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా దాదాపు 5 శాతం కుదేలవగా, ఐటీ, బ్యాంకింగ్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్లో టాటా స్టీల్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, విప్రో, ఎల్అండ్టీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.92 వద్ద ఉంది.