రూ.29 కే జియోసినిమా ప్రీమియం.. 4K వీడియోలు, నో యాడ్స్

by Disha Web Desk 17 |
రూ.29 కే జియోసినిమా ప్రీమియం.. 4K వీడియోలు, నో యాడ్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియోసినిమా వినియోగదారుల కోసం కొత్తగా మరో రెండు ప్లాన్‌‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవి రూ.29, రూ.89. యూజర్లకు వీడియో స్ట్రీమింగ్‌లో సరికొత్త అనుభూతిని అందించడానికి వీటిని తీసుకొచ్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. JioCinema ప్రీమియం ప్లాన్‌లు గరిష్టంగా 4K నాణ్యతతో వీడియోను అందిస్తాయి. అలాగే ఎలాంటి యాడ్‌లు రావు. వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్ ద్వారా కూడా చూసుకోవచ్చు. వెబ్‌సిరీస్‌లు, హాలీవుడ్ సినిమాలు, పిల్లల షోలు, ఇతర కంటెంట్‌ను సబ్‌స్క్రైబర్‌లు కనెక్ట్ చేసుకున్న స్మార్ట్‌టీవీలతో సహా ఏ ఇతర డివైజ్‌లలో అయిన చూడవచ్చు.

కుటుంబ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూ.89 ప్రీమియం ఫ్యామిలీ ప్లాన్‌‌ను సైతం జియో తీసుకొచ్చింది. దీని ద్వారా ఒకేసారి నాలుగు స్క్రీన్‌లలో ఏకకాలంలో వీక్షించడానికి అనుమతి ఉంటుంది. రూ.29 ప్లాన్‌లో లభించే అన్ని సదుపాయాలు ఈ ప్లాన్‌లో కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న జియోసినిమా ప్రీమియం సభ్యులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ ప్లాన్‌కి అప్‌గ్రేడ్ చేయబడతారని ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది. IPL వంటి లైవ్ స్పోర్ట్స్‌తో సహా ఉచిత కంటెంట్‌ను చూస్తూనే, జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ద్వారా అంతర్జాతీయ కంటెంట్‌ను స్థానిక భాషలలో చూడవచ్చు. దేశంలోని ప్రతి ఇంట్లో ఎంటర్‌టైన్ మెంట్ పర్యావరణ వ్యవస్థ రూపొందించడానికి, స్థానిక భాషల్లో సురక్షితమైన కంటెంట్ అందించడానికి కృషి చేస్తున్నామని జియో ఒక ప్రకటనలో పేర్కొంది.



Next Story

Most Viewed