నెల్లూరులో కిడ్నాప్ కలకలం

by  |
నెల్లూరులో కిడ్నాప్ కలకలం
X

దిశ వెబ్ డెస్క్: నెల్లూరులో బాలుడి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. అచ్యుత్ అనే బాలున్ని కొందరు గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. కాగా దుండగులు స్థానికుల కంటపడ్డారు. వారిలో ఒకరిని స్థానికులు పట్టుకుని దేహ శుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. పారిపోయిన నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణంగా ఈ కిడ్నాప్ నకు కారణం అయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా బాలుడిని స్థానికులు కాపడటంతో అతని తల్తి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.


Next Story