- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బైక్ ఢీకొని కార్మికుడి మృతి
దిశ, పటాన్ చెరు: బైక్ ఢీకొని ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రం సోనిట్ పూర్ జిల్లా బుర్జ్ జోలి గ్రామానికి చెందిన రోహిత్ గోసాయి (19) కొంత కాలంగా ఇస్నాపూర్ శివారులో గల ఇండువేర్ పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నారు. కంపెనీకి చెందిన క్వార్టర్స్లో ఆయన నివాసం ఉంటున్నాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి క్వార్టర్స్ నుండి ఇస్నాపూర్ వైపు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం అతను వెళుతున్నాడు. ఇంతలో సంగారెడ్డి నుండి పటాన్ చెరు వైపు వస్తున్నఓ బైక్ వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో రోహిత్ గోసాయికి తలకు బలమైన గాయాలు అయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి అతన్ని తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి రాజేష్ గోసాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఎస్ఐ సాయిలు దర్యాప్తు చేస్తున్నారు.