సిద్ధిపేట జిల్లాలో మరొకరికి కరోనా

by vinod kumar |   ( Updated:2020-06-18 04:29:39.0  )
సిద్ధిపేట జిల్లాలో మరొకరికి కరోనా
X

దిశ, మెదక్: సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగళ్లపల్లిలో గ్రామంలో ఒకరికి కరోనా సోకింది. ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ లోని ఓ మార్కెట్ లో పని చేస్తుంటాడు. మూడు రోజుల క్రితం అతను స్వగ్రామం తంగళ్లపల్లికి వచ్చాడు. అతను మంగళవారం తీవ్ర జ్వరంతో బాధపడుతూ కరోనా పరీక్షల కోసం హైదరాబాద్ కి వెళ్ళాడు. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా బుధవారం రాత్రి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అతను గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు గ్రామంలో ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నడో అధికారులు గుర్తిస్తున్నారు.

Advertisement

Next Story