ఏపీ అసెంబ్లీలో సభా హక్కుల కమిటీ భేటీ

by srinivas |
ఏపీ అసెంబ్లీలో సభా హక్కుల కమిటీ భేటీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ అసెంబ్లీలో సభా హక్కుల కమిటీ మంగళవారం భేటీ అయ్యింది. చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌పై వచ్చిన ఫిర్యాదులపై సభాహక్కుల కమిటీ చర్చించింది. స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీమంత్రి అచ్చెన్నాయుడు, కూన రవిలకు సభా హక్కుల కమిటీ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేకపోతున్నానని కమిటీకి అచ్చెన్నాయుడు సమాచారమివ్వగా…కూన రవి హాజరుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో భవిష్యత్ కార్యచరణపై సభా హక్కుల కమిటీ చర్చిస్తోంది.

Next Story

Most Viewed