కరోనా నియంత్రణకు ఏపీలో మూడంచెల్లో ఏర్పాట్లు

by srinivas |
కరోనా నియంత్రణకు ఏపీలో మూడంచెల్లో ఏర్పాట్లు
X

కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్ర్రవ్యాప్తంగా మూడంచెల్లో అనగా.. అసెంబ్లీ నియోజకవర్గం, రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయిలో ఐసోలేషన్, క్వారంటైన్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన ట్వీట్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారందరని క్వారంటైన్‌కు తరలిస్తున్నామని తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారికి ముందు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని విజయసాయిరెడ్డి తెలిపారు.

Tags: Vijay Sai Reddy, YSRCP, Corona Virus

Advertisement
Next Story