- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: గతనెలలో బందరులో అదృశ్యమైన మహిళ శనివారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద శవమై కనిపించడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నానికి చెందిన పల్లపోతు పద్మజ(45) సర్కిల్పేటలో నివాసం ఉంటూ ఓ రెస్టారెంటులో పనిచేస్తోంది. ఆగస్టు 31న విధులకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఇనగుదురుపేట పోలీసు స్టేషన్లో బంధువులు ఫిర్యాదు చేశారు. ఇదేక్రమంలో శనివారం నార్కట్పల్లి వద్ద ఓ మహిళ మృత దేహం కాలిపోయి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రాథమిక దర్యాప్తులో మృతదేహం పద్మజ అనే మహిళదిగా గుర్తించి ఇనగుదురు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులతోపాటు బంధువులు నార్కట్పల్లి చేరుకొని మృతదేహాన్ని మచిలీపట్నం తరలించారు. పద్మజను హత్య చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండు చేస్తున్నారు.
Next Story