‘సీఎం జగన్ ఆత్మలతో మాట్లాడటం మీరు చూశారా..?’

by srinivas |
‘సీఎం జగన్ ఆత్మలతో మాట్లాడటం మీరు చూశారా..?’
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టులపై చంద్రబాబు చేసిన విమర్శలను ఖండించారు. నిధులు లేని కార్పొరేషన్‌కు పదవులు దేనికని చంంద్రబాబు విమర్శించడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఏనాడైనా ఇంతలా నామినేటెడ్ పదవులు ఇచ్చారా అని నిలదీశారు. సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే పదవులను కట్టబెట్టారని మంత్రి ఆరోపించారు.

టీడీపీ అంటేనే ఒక కులానికి కాపుకాసే పార్టీ అని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ తెలుసునన్నారు. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడును రాష్ట్ర అధ్యక్షుడిని చేశానని గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు ఏనాడైనా ఆయన మాటకు విలువ ఇచ్చారా అని ప్రశ్నించారు. అందుకే అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్కా లేదని అన్నారని గుర్తు చేశారు. మరోవైపు సీఎం జగన్ ఆత్మలతో మాట్లాడుతున్నాడని చంద్రబాబు విమర్శించడం సిగ్గుచేటన్నారు. జగన్ విజయాన్ని చూడలేని ఓ చండాలుడి మాటలు పట్టుకుని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఇది మరీ దారుణమన్నారు. ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవమని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోకపోతే ప్రజల్లో కనుమరుగై పోవడం ఖాయమని మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed