పవన్ కల్యాణ్‌పై పోతిన మహేశ్ మరోసారి హాట్ కామెంట్స్

by Disha Web Desk 16 |
పవన్ కల్యాణ్‌పై పోతిన మహేశ్ మరోసారి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత పోతిన మహేశ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సీటు ఆశించి భంగపడిన ఆయన ఇటీవల జనసేన నుంచి వైసీపీలోకి చేరిన నాటి నుంచి పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా కూడా పవన్ కల్యాణ్‌పై పోతిన మహేశ్ విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ పని చేస్తున్నారని ఆరోపించారు. కాపు యువతకు జనసేనాని అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జనసైనికులను టీడీపీ జెండా కూలీలుగా మార్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాల్లో అసలు జనసేన పార్టీనే లేదన్నారు. పవన్ కల్యాణ్ దారెటో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. జైలులో చంద్రబాబును కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ ఆస్తులు పెరిగాయని చెప్పారు. బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలను త్వరలో బయటపెడతానని పోతిన మహేశ్ హెచ్చరించారు.

పవన్ కల్యాణ్ ప్రాకేజీ స్టార్ అని ప్రతి ఒక్కరికీ తెలుసని పోతిన మహేశ్ ఎద్దేవా చేశారు. మంగళగిరి జనసేన కార్యాలయం ఎలా కొన్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారనేది సైతం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చాయని, ఆ వివరాలు కూడా బయటకు వెల్లడించాలన్నారు. జనసేనకు వచ్చిన విరాళాలపై పోతిన మహేశ్ ప్రశ్నల వర్షం కురిపించారు. విరాళాల లెక్క చెప్పడంతో పాటు ఎంత ఖర్చు పెట్టారనే విషయాలు కూడా బయటకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. జనసేన ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు సైతం పవన్ కల్యాణ్ బయటకు వివరించాలని పోతిన మహేశ్ డిమాండ్ చేశారు.

Read More..

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం తగునా జగన్...?

Next Story

Most Viewed