Ap News: ఫారెస్ట్ అధికారులపై దాడికి యత్నం.. ఏడుగురి అరెస్ట్

by Disha Web Desk 16 |
Ap News: ఫారెస్ట్ అధికారులపై దాడికి యత్నం.. ఏడుగురి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం అల్లంచర్ల అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అడవిలో చెట్లు నరుకుతూ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుల్ని కోర్టుకు తరలిస్తుండగా మరో ముఠా అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారుల వాహనాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు తప్పించుకున్నారు. ఎట్టకేలకు ఏడుగురిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేసి చింతలపూడికి తరలించారు. అటవీ ప్రాంతంలో చెట్లు నరకడం, భూమిని కబ్జా చేయడం నేరమని అని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఎవరైనా అటవీ ప్రాంతాన్ని కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేకుండా కలపను తరలించడంపై కేసులు పెడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు.



Next Story