Good News: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నేషనల్ హైవే.. పనులు వేగవంతం

by srinivas |   ( Updated:2025-02-05 11:47:38.0  )
Good News: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నేషనల్ హైవే.. పనులు వేగవంతం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో కొత్తగా నేషనల్ హైవే(National Highway) నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిడుగురాళ్ళ(Piduguralla) మీదుగా హైదరాబాద్‌(Hyderabad)కు కనెక్టవిటీని పెంచేందుకు అడుగులు వేసింది. అంతేకాదు ఈ హైవే పనులను తాజాగా వేగవంతం చేసింది. వాడరేవు(Odarevu)- పిడుగురాళ్ల నేషనల్ హైవే 167ఏను నిర్మించేందుకు ముందుకు వచ్చిన కేంద్రం.. బాపట్ల(Bapatla) జిల్లాలో పనుల్ని వేగవంతం చేసింది. దీంతో బాపట్ల జిల్లాలో రూపురేఖలు మారనున్నాయి. కోస్తా(Kostha)లో వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారి కీలకమైంది. 167ఏ నేషనల్ హైవే నిర్మాణ పనులు బాపట్ల జిల్లా పర్చూరు(Parchur) మండల పరిధిలో జరుగుతున్నాయి. పర్చూరును అనుసంధానం చేస్తూ కారంచేడు మీదుగా వాడరేవు వరకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఈ హైవే నిర్మాణంతో పాటుగా కల్వర్టులు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌ల పనులకు శ్రీకారం చుట్టారు. హైవే అధికారుల పర్యవేక్షణలోనే ఈ పనులు కొనసాగుతున్నాయి. 67ఏ హైవే వాడరేవు - పిడుగురాళ్ల వరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను కనెక్ట్ చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి వాడరేవు రవాణాకు ఉపయోగంగా ఉంటుంది. మోటుపల్లి, పెద్దగంజాం ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలోనే రైల్వే ట్రాక్‌ కూడా ఉండడం కూడా కలిసొస్తుంది.

అయితే ఈ హైవే నిర్మాణంతో తెలంగాణ(Telangana) - ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) మధ్య రవాణా మరింత సులువు అవుతుందని అధికారులు చెబుతున్నారు. చీరాల(Chirala) ప్రాంతంలో వాడరేవు ఉండడంతో పర్యాటన రంగం కూడా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. ‘‘వాణిజ్య వ్యాపారాలు సైతం హైవే నిర్మాణంతో మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ హైవే హైదరాబాద్‌ (అద్దంకి- నార్కెట్‌పల్లి)కు కూడా కనెక్ట్ అవుతోందని అంటున్నారు. నేషనల్ హైవే 167-A విస్తరణ ప్రాజెక్ట్ వాడరేవు-పిడుగురాళ్ల మధ్య నాలుగు లేన్లుగా నిర్మాణం జరుగుతోంది. మొతం 85 కిలోమీటర్లకుపైగా ఈ జాతీయ రహదారి నిర్మాణం కోసం రూ.1,064.24 కోట్ల వ్యయం అవుతోంది. నెకరికల్లు దగ్గర అద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్, చీరాల దగ్గర నేషనల్ హైవే 216, చిలకలూరిపేట దగ్గర నేషనల్ హైవే 16 కి అనుసంధానం చేస్తున్నాం. వాడరేవు నుంచి ఈపురుపాలెం వరకు 18 కిలో మీటర్లు కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాం. పర్చూరు, తిమ్మరాజుపాలెం, చిలకలూరిపేట దగ్గర బైపాస్‌లు ఉంటాయి. ఈ హైవేతో చీరాల నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహంతో పాటుగా బాపట్ల-ఓడరేవు మధ్య బీచ్ టూరిజం అభివృద్ధి చెందుతుంది. మరోవైపు ఈ 167ఏ వాడరేవు-పిడుగురాళ్ల హైవేలో కీలకమైన నరసరావుపేట బైపాస్‌ సర్వే కూడా మొదలైంది. భూసేకరణ కూడా నరసరావుపేట బైపాస్‌ మినహా మిగతా అన్నిచోట్లా పూర్తికాగా అలైన్‌మెంట్‌ మార్చాలని కొందరు రైతులు కోరారు. కానీ జాతీయ రహదారి అథారిటీ అధికారులు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. డీపీఆర్‌కు అనుగుణంగానే కేసానుపల్లి, జొన్నలగడ్డ, రావిపాడు మీదుగానే బైపాస్‌ నిర్మించేలా ముందుకెళ్తున్నారు.ఈ మేరకు సర్వే పనుల్లో బిజీగా ఉన్నాం.’’ అని అధికారులు పేర్కొన్నారు.

Next Story