మళ్లీ మాట్లాడితే నాలుక కోస్తాం: ప్రకాశ్‌రాజ్‌కు కిరణ్ రాయల్ హెచ్చరిక

by srinivas |
మళ్లీ మాట్లాడితే నాలుక కోస్తాం: ప్రకాశ్‌రాజ్‌కు కిరణ్ రాయల్ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం (Tirumala Laddu Dispute) రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. గత ఐదేళ్లకాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వులు కలిశాయని వెల్లడికావడంతో ప్రస్తుతం హిందువులందరూ (All Hindus) మండిపడుతున్నారు. కల్తీ కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Actor Prakash Raj) సైతం స్పందించారు. అయితే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ (Ap Deputy Cm Pawan Kalyan) పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఏపీలో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని, లడ్డూ వివాదంపై విచారణ చేయించాలని ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు. అంతేకాదు దోషులను గుర్తించి శిక్షించాలని సూచించారు. అయితే లడ్డూ వివాదాన్ని దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ఎందుకు రెచ్చ గొడుతున్నారని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. మత ఘర్షణలు దేశానికి వద్దని, కేంద్రంలోని పవన్ మిత్రులకు ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా ప్రకాశ్‌రాజ్ వ్యగ్యంగా కామెంట్స్ చేశారు.

దీంతో ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై జనసేన నాయకులు (Janasena Leaders) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ ఒక నాస్థికుడని మండిపడుతున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్‌తో పాటు ఎవరైనా సరే మరోసారి మాట్లాడితే నాలుక కోస్తామని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్(Tirupati Janasena Leader Kiran Royal) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇంకా మాట్లాడుతూ ‘‘దేవుడికి ప్రకాశ్ రాజ్ మొక్కడు. నాస్థికుడు. ఆయనకు దైవభక్తి లేదు. పబ్బులు, డిస్కోలే ప్రకాశ్‌రాజ్‌కు కావాలి. తిరుమల లడ్డూ మా సెంటిమెంట్. మేము తిరుపతిలో పుట్టాం, పెరిగాం. హిందువులం. తిరుమల లడ్డూతో ప్రపంచాన్ని జయించే సత్తా ఉంది. ఇది మా లోకల్ ఎమోషనల్ ఫీలింగ్. తిరుమల లడ్డూపై సోషల్ మీడియాలో అవాస్తవాలు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే ఎవరైనా సరే నాలుక కోస్తాం.’’ అని కిరణ్ రాయల్ హెచ్చరించారు.

Next Story

Most Viewed