AP News:‘ఆడుదాం ఆంధ్ర’ స్కాంపై బైరెడ్డి రియాక్షన్ ఇదే!

by Jakkula Mamatha |
AP News:‘ఆడుదాం ఆంధ్ర’ స్కాంపై బైరెడ్డి రియాక్షన్ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంలో క్రీడాశాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతో రూ.100 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని మాజీ కబడ్డీ క్రీడాకారుడు ఆర్‌డీ ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశామన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులపై విచారణ జరపాలని కోరామన్నారు. కాగా, ఈ స్కాంలో రోజా, సిద్ధార్థ రెడ్డి పై ఆరోపణలు వచ్చాయనే విషయం తెలిసిందే. ఈ ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రూ.100 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు రావడంతో.. తాజాగా దీనిపై శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పందించారు. తాము ఎలాంటి కేసులకు భయపడేది లేదని చెప్పారు. సీఐడీకి కాకుంటే సీబీఐకి ఫిర్యాదు చేసుకోవాలని సవాల్ విసిరారు. ఎలాంటి విచారణకు అయినా తాను సిద్ధమేనని వెల్లడించారు.



Next Story