- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijayasai Reddy : నా భార్యను లోబర్చుకొని రూ.1500 కోట్ల భూములు కొల్లగొట్టారు: విజయసాయిరెడ్డిపై మంత్రి నారా లోకేష్ కు కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు
![Vijayasai Reddy : నా భార్యను లోబర్చుకొని రూ.1500 కోట్ల భూములు కొల్లగొట్టారు: విజయసాయిరెడ్డిపై మంత్రి నారా లోకేష్ కు కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు Vijayasai Reddy : నా భార్యను లోబర్చుకొని రూ.1500 కోట్ల భూములు కొల్లగొట్టారు: విజయసాయిరెడ్డిపై మంత్రి నారా లోకేష్ కు కళింగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు](https://www.dishadaily.com/h-upload/2024/12/17/401503-lalaigiri.webp)
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) నా భార్యను లోబర్చుకొని విశాఖపట్నంలో రూ.1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని, ఆయన అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై పోరాడుతున్నందుకు తనను ఇటీవల హైదరాబాద్ నుంచి కోల్ కతాకు బదిలీ చేయించారని సస్పెన్షన్ కు గురైన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి(Kalingiri Shanti) భర్త మదన్ మోహన్(Madan Mohan) ఆవేదన వ్యక్తంచేశారు. ఉండవల్లి నివాసంలో ప్రజాదర్బార్ కు విచ్చేసిన మదన్ మోహన్... మంత్రి లోకేష్(Minister Nara Lokesh)ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. నేను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ (ఐఐపి)లో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నానని, ఎంపీ విజయసాయి రెడ్డి, అడ్వకేట్ సుభాష్ కలసి తన భార్య కళింగిరి శాంతిని లోబర్చుకొని విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలివరకు పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
2022-23 నడుమ నన్ను ఏమార్చి అమెరికా పంపిన ఎంపీ విజయసాయి నా భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి మగబిడ్డను కన్నారని, తాను స్థానికంగా లేని సమయంలో బిడ్డకు విజయసాయిరెడ్డినే తండ్రి అని నేను గట్టిగా విశ్వసిస్తున్నానని స్పష్టం చేశారు. తనకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంమంత్రి డీజీపీలను కలిసి విన్నవించానని తెలిపారు. ఇప్పటివరకు నాకు న్యాయం జరగలేదని, విజయసాయిరెడ్డికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండని మంత్రి లోకేష్ ను కోరారు. గత ప్రభుత్వ హయాంలో శాంతి అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన కాలంలో రూ.20కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించిందని, కుంచనపల్లిలో రూ.4కోట్ల విలువైన విల్లా, జగన్ ఇంటి సమీపంలో రూ.3కోట్ల విలువైన ఇల్లు, విశాఖ సాగర్ నగర్ లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తోపాటు ఆమెకు విలాసవంతమైన కార్లు ఉన్నాయని మధన్ మోహన్ వెల్లడించారు.
విశాఖలో విజయసాయి, సుభాష్, తన భార్య శాంతి కలిసి కొట్టేసిన రూ.1500 కోట్ల భూములపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విజయసాయి కుట్రతో కోల్ కతా బదిలీ అయిన తనను తిరిగి హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేయించాలని మదన్ మోహన్ విన్నవించారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.