తీవ్ర విషాదం.. వడదెబ్బతో ముగ్గురు మృతి

by Disha Web Desk 16 |
తీవ్ర విషాదం.. వడదెబ్బతో ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అడుగు భయపెట్టాలటే జనం జంకిపోతున్నారు. మరోవైపు ఎండవేడిమికి వృద్ధులు పండుటాకుళ్లా రాలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వడదెబ్బతో ముగ్గురు వృద్ధులు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన సుబ్బారావు అనే రైతు రోజు మాదిరిగానే గేదెలను మేపేందుకు పొలానికి వెళ్లారు. అయితే ఎండమేడిమితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం ఇంటికి వచ్చి కుప్పకూలిపోయారు. సుబ్బారావును కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సుబ్బారావు (65) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా చెన్నారావుపాలెంలో కోట సుశీలమ్మ (80), స్వరాజ్యం (65) వడదెబ్బతో మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed