SIT: ఎన్నికల వేళ అల్లర్లు.. కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించిన సిట్

by Indraja |   ( Updated:2024-05-18 15:30:32.0  )
SIT: ఎన్నికల వేళ అల్లర్లు.. కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించిన సిట్
X

దిశ వెబ్ డెస్క్: ఎన్నికల నేపథ్యంలో దాడులు, హింసాత్మక ఘటనలతో పల్నాడులో రావణకాష్టం రగిలిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఎన్నికలు ముగిసిన తరువాత కూడా దాడులు, ఘర్షణలతో జిల్లాలోని పలునియోజకవర్గాలు దద్దరిల్లాయి. ఈ నేపథ్యంలో పల్నాడులో 144 సెక్షన్ సైతం అమలైంది. కాగా ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి నియంత్రనలోకి వచ్చింది.

కాగా న్నికల నేపథ్యంలో జరిగిన ఘటనలపై విచారణ చేసే బాధ్యతను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్‌‌కు అప్పగించింది. కాగా సిట్ విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వందల కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది వైసీపీ నేతలను, 8 మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా దాడులు, ఘర్షణలకు సంబంధించిన వీడియోలను చూసి పోలీసులు నిందితులను గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురజాల నియోజకవర్గంలో 100 కేసులు నమోదుకాగా.. ఎఫ్ఐఆర్‌లో 192 మంది పేర్లు ఉన్నాయి. అలానే దాచేపల్లి మండలంలో 70 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ సెక్షన్ 307,324,323 కింద కేసు నమోదైంది.

ఇక సత్తెనపల్లిలో 34 కేసులు నమోదు చేసిన పోలీసులు 70 మంది నిందితులను గుర్తించారు. అలానే నరసరావుపేటలో 20 కేసులు నమోదుకాగా, 60 మంది నిందితులను గుర్తించారు. నరసరావుపేటలో దాడులకు పాల్పడిన 11 మందిపై ఐపీసీ సెక్షన్ 147,148,324 కింద కేసులు నమోదు చేశారు. పెదకూరపాడులో 5 కేసులు నమోదుకాగా 99 మంది నిందితులను గుర్తించారు.

కాగా ఎఫ్ఐఆర్‌లో మరికొందరి పేర్లు చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మాచర్ల నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే మాచర్ల నియోజకవర్గంలో కేసులుపై పోలీసులు సమాచారం ఇవ్వలేదు.

Advertisement

Next Story

Most Viewed