చంద్రబాబు నామినేషన్‌కు ముహూర్తం ఖరారు

by Disha Web Desk 9 |
చంద్రబాబు నామినేషన్‌కు ముహూర్తం ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 19 వ తేదీన కుప్పంలో నామినేషన్ వేయనున్నారు. చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నది. ఈ విషయాన్ని బుధవారం పార్టీ అధికారికంగా ప్రకటించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతోన్న చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మంగళగిరిలో రేపు(ఏప్రిల్ 18) నామినేషన్ వేయనున్నారు. రేపు ఉదయం శ్రీసీతారాముల ఆలయం నుంచి ర్యాలీగా బయల్దేరి నామినేషన్ సమర్పించనున్నారు. ఇక రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఈ నెల 19న నామినేషన్ వేయనున్నారు. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో పొలిటికల్ కామెంట్లు హద్దు మీరుతున్నాయి. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగి విమర్శలకు దిగుతున్నారు. ఇదే కాకుండా అగ్ర నేతలైన చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్‌లపై రాళ్ల దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ పరిణామాలపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed