రహదారిపై విరిగి పడిన చెట్టు.. రెండు గంటలుగా నిలిచిపోయిన రాకపోకలు

by Disha Web Desk 23 |
రహదారిపై విరిగి పడిన చెట్టు.. రెండు గంటలుగా నిలిచిపోయిన రాకపోకలు
X

దిశ, ఆదిలాబాద్ : ఉట్నూర్ మండలంలోని బీర్సాయి పేట లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులకు భారీ వృక్షం ప్రధాన రహదారిపై నెలకొరిగింది. జన్నరాం మండల కేంద్రంలో ప్రచారం ముగించుకొని ఉట్నూర్ కు తిరుగు పయనమైన ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు విషయాన్ని గమనించి వెంటనే అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బుల్ డోజర్ సహాయంతో భారీ వృక్షాన్ని తొలగించడానికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేసిన పనికి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed