- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Rajahmundry: ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచేసిన నారా లోకేశ్
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ విశ్వజీత్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పొగడ్తలతో ముంచేశారు. ప్రపంచంలోనే నెంబర్ వన్గా భారత్ను మోడీ తీర్చి దిద్దుతున్నారని ఆయన తెలిపారు. రాజమండ్రి వేమగిరిలో కూటమి తరపున నిర్వహించిన సభలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ దేశానికి మోదీ అవసరం చాలా ఉందని అభిప్రాయం వ్యకం చేశారు. నమో నమో అనే 4 అక్షరాలు ఈ దేశం దశ.. దిశ మార్చిందని కొనియాడారు. తెలుగు పౌరుషాన్ని దేశానికి ఎన్టీఆర్ పరిచయం చేస్తే.. ప్రపంచానికి మన దేశ పౌరుషాన్ని పరిచయం చేసిన వ్యక్తి ప్రధాని మోడీ అని పేర్కొన్నారు. దేశ బాగోగులు ప్రధాని మోడీకి బాగా తెలుసని నారా లోకేశ్ తెలిపారు. దేశంలో పేదరికం లేకుండా చేయడమే మోడీ లక్ష్యమని చెప్పారు. వికసిత ఏపీ చంద్రబాబు, పవన్ కల అని తెలిపారు. జగన్ హయాంలో యువతే మొదటి బాధితులని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు తీసుకొచ్చిన కంపెనీలను పొరుగు రాష్ట్రాలకు తరిమివేశారని మండిపడ్డారు. జగన్ 59 నెలల పాలనలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని విమర్శించారు. ఉభయ గోదావారి జిల్లా ప్రజల మనసు చాలా పెద్దదని, అక్కడి వారి మమకారం, వెటకారం సూపర్గా ఉంటుందని నారా లోకేశ్ తెలిపారు.