తిరుమల చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

by Seetharam |   ( Updated:2023-11-30 12:19:23.0  )
తిరుమల చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవారి దర్శనార్థం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిరుపతి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. గురువారం ఉదయం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్‌ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పలువురు స్వాగతం పలికారు. టీడీపీ అధినేత రాకతో విమానాశ్రయం వద్ద భారీ కోలాహలం నెలకొంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. విమానాశ్రయం నుంచి కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు అభివాదం చేస్తూ రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు. నేటి రాత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టు చేరుకుని అమరావతి వెళ్తారు. మరుసటి రోజు డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకుని మెుక్కులు చెల్లించుకుంటారు. ఇకపోతే డిసెంబర్ 3న విశాఖ వెళ్లనున్నారు. అదేరోజు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్నను చంద్రబాబు కుటుంబం దర్శించుకోనుంది. ఈ మేరకు టీడీపీ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.

Advertisement

Next Story

Most Viewed