AP Elections: చంద్రబాబు ఎన్నికల శంఖారావం.. అక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం

by srinivas |
AP Elections: చంద్రబాబు ఎన్నికల శంఖారావం.. అక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్నికల ప్రచారానికి సైతం శ్రీకారం చుట్టారు. ‘రా కదలి రా’ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా వేదికపై నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 22 వరకు పార్లమెంట్ స్థానాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం పాల్గొననున్నారు.

కాగా వచ్చే ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నారు. సీఎం జగన్‌ను ఢీకొట్టేందుకు అస్త్రశస్త్రాలు రెడీ చేస్తున్నారు. జగన్ ఇంచార్జుల మార్పుల్లో బీజీ‌గా ఉన్నారు. దీంతో చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. బహిరంగ సభల ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. ఇప్పటికే గ్యారంటీ పథకాలతో ఆ పార్టీ నాయకులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశాలపై ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎన్నికల ప్రచారానికి పూనుకోవడంతో అటు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.



Next Story