AP:‘వైద్యులపై దాడి అమానుషం’..దాడి జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

by Jakkula Mamatha |
AP:‘వైద్యులపై దాడి అమానుషం’..దాడి జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
X

దిశ,అమలాపురం:వైద్యులను దేవుళ్లుగా భావించి మన సంస్కృతిగా పాటించే తరుణంలో రావులపాలెంలో ప్రగతి నర్సింగ్ హోమ్ వైద్యులు, సిబ్బందిపై దాడి చేయడం అమానుషం అని పాలూరి సత్యానందం అన్నారు. ఈ సందర్భంగా సత్యానందం మాట్లాడుతూ.. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వైద్యం అందించి ప్రాణాలు కాపాడే వైద్యులపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. దీనిపై పోలీసు అధికారులు చట్ట పరంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, బాధితులకు అండగా ఉండి తగు న్యాయం చేయాలని సత్యానందం కోరారు.

Advertisement

Next Story

Most Viewed