విశాఖ స్టీల్ వద్ద ఉద్రిక్తత..హైవేను దిగ్బంధించిన స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-10 07:03:52.0  )
విశాఖ స్టీల్ వద్ద ఉద్రిక్తత..హైవేను దిగ్బంధించిన స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు
X

దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం కూడలిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ, నిర్వాసితుల రాస్తారోకోలో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నేషనల్ హైవేను దిగ్బంధించారు. రోడ్డుపై బైఠాయించి కార్మికులు నిరసన చేపట్టడంతో కూర్మన్నపాలెంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలతో పోలీసుల చర్చలు జరిపారు.

Read More:

ప్రైవేటీకరణ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్..? ఈ రోజు కీలక మీటింగ్‌

Advertisement

Next Story