శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు

by Jakkula Mamatha |
శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు
X

దిశ,శ్రీశైలం:నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో శ్రీ మల్లికార్జున స్వామి, అమ్మవారి లడ్డూ ప్రసాదాలను నంద్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఆలయ ప్రాంగణంలోని లడ్డూ తయారీ ప్రక్రియ, లడ్డూ విక్రయ కేంద్రాలలోని లడ్డూ ప్రసాదాలను పరిశీలించి వాటి నాణ్యతపై వివరాలు సేకరించారు. ఇటీవల దేవస్థానంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి, ఇతర పదార్థాల శాంపిల్స్‌ని హైదరాబాద్ ల్యాబరేటరీకి పంపించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. అలాగే దేవస్థానం పరిధిలోని గణేష్ ఫుడ్ కోర్టు హోటల్‌లోని ఆహార పదార్థాలను తనిఖీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed