వైసీపీ వర్గాల రాళ్ళ దాడి.. టీడీపీ కార్యకర్త మృతి

by M.Rajitha |
వైసీపీ వర్గాల రాళ్ళ దాడి.. టీడీపీ కార్యకర్త మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రామ దేవత ఉత్సవాల్లో జరిగిన చిన్న గొడవ ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం వనవిష్ణుపురం గ్రామంలో గ్రామ దేవత ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఓ చిన్న వివాదం చిలికి చిలికి పెద్ద గొడవకు దారి తీసి.. వైసీపీ వర్గానికి చెందిన కొంతమంది టీడీపీ వర్గీయులపై రాళ్ళ దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఓ టీడీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఉన్నతాధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చి, భారీ బందోబస్తు నడుమ మిగతా ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed