YS Sharmila:నడుం లోతు నీళ్లలో షర్మిల..రైతులను ఆదుకోవాలని వినతి

by Jakkula Mamatha |
YS Sharmila:నడుం లోతు నీళ్లలో షర్మిల..రైతులను ఆదుకోవాలని వినతి
X

దిశ, డైనమిక్‌ బ్యూరో:భారీ వర్షాలకు నీటమునిగిన పంటలను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఆమె నడుము లోతు నీళ్లలో రైతుల సహాయంతో దిగి పరిశీలన చేశారు. నీళ్లలో దిగి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పైన ఉన్న ఎర్రకాలువ మరమ్మతుల జరగలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రాజెక్టులకు మరమ్మతులు చేయలేదన్నారు. ఆఖరికి పూడికలు కూడా తీయకపోవడంతో పొలాల్లోకి నీళ్లు వచ్చాయన్నారు. చంద్రబాబు రైతులను ఆదుకోవాలని కోరారు.


AP News:ఆ పార్టీ పై సంచలన ఆరోపణలు చేసిన నాగబాబు



Next Story