నన్ను సర్వనాశనం చేసిన వాణి వైపు చూడను.. దువ్వాడ సంచలన వ్యాఖ్యలు

by Anjali |
నన్ను సర్వనాశనం చేసిన వాణి వైపు చూడను.. దువ్వాడ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ నెల 6 న ఇంటి రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందని, ఇంటికి సంబంధించిన పూర్తి హక్కులు నాకు వచ్చాయని మాధురి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇకపై ఇల్లు నాదేనని దువ్వాడ శ్రీనివాస్‌ది కాదని మీడియా సమావేశంలో వెల్లడించింది. కాగా తాజాగా దువ్వాడ శ్రీనివాస్ నా ఇష్టపూర్వకంగానే మాధురికి ఇంటిని రాసిచ్చానని క్లారిటీ ఇచ్చాడు. మాధురి తనకు 2 కోట్ల రూపాయల సహాయం చేసిందని చెప్పాడు. ఆ ఇంటి నిర్మాణం కోసమే డబ్బులు వినియోగించానని తెలిపాడు. కాగా మాధురికి ఇచ్చేందుకు నా దగ్గర డబ్బులు లేవని, అందుకే మాధురికి ఇంటిని రాసిచ్చానని దువ్వాడ పేర్కొన్నాడు. నా ఆవేదనను కోర్టులో చెప్పుకుంటానని అన్నాడు. నన్ను సర్వనాశనం చేసిన వాణి వైపు చూడనని దువ్వాడ భార్యపై మండిపడ్డాడు.

Advertisement

Next Story

Most Viewed