వాళ్లవల్లే వెంకట్‌రెడ్డి చనిపోయారు.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
వాళ్లవల్లే వెంకట్‌రెడ్డి చనిపోయారు.. సజ్జల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ కార్యకర్త వెంకట్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బైక్‌తో ఢీకొట్టారని, కిందపడటంతో ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరిలో వెంకట్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ నారా లోకేశ్ నామినేషన్ వేసే సమయంలో ఘర్షణ జరిగిందని, టీడీపీ కార్యకర్తలే వెంకట్ రెడ్డిని బైక్‌తో ఢీకొట్టారని ఆరోపించారు. టీడీపీ శ్రేణులు హింసారాజకీయాలు చేస్తున్నారన్నారు. హింసా రాజకీయాలు ఆపకపోతే తమ పార్టీ నుంచి వచ్చే రియాక్షన్‌ను తట్టుకోలేరని హెచ్చరించారు. టీడీపీకి ఈ ఎన్నికలే చివరివని జోస్యం చెప్పారు. 2024 తర్వాత టీడీపీ కనుమరుగవుతుందన్నారు. రాష్ట్రానికి పట్టిన పీడ కూడా వదలిపోతుందని విమర్శించారు.

Next Story

Most Viewed