సైకో బ్యాచ్ ఈ అలవాట్లు చేసుకోండి.. వైసీపీ నేతలకు TDP నాయకుడు పట్టాభి అడ్వైస్

by Rajesh |
సైకో బ్యాచ్ ఈ అలవాట్లు చేసుకోండి.. వైసీపీ నేతలకు TDP నాయకుడు పట్టాభి అడ్వైస్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి వైసీపీ నేతలకు అదిరిపోయే సలహా ఇచ్చారు. సోమవారం ఆయన టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గుడివాడ గుట్కా గాడు.. గన్నవరం సైకోగాడు.. పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, అవినాష్ రెడ్డి ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. అయితే తాము ఇళ్ల మీదకు వెళ్లమని.. ఇంట్లో వాళ్ల తిట్టమని తెలిపారు. అయితే ఇప్పటి నుంచి నేల మీద పడుకోవాలని మంచాల మీద పరుపుల మీద పడుకోవడం మానేయాలన్నారు. వెస్టర్న్ కమోడ్లు మార్చేసి ఇండియన్ టాయ్ లెట్ అలవాటు చేసుకోవాలన్నారు. బిర్యానీలు, పలావులు మానేసి దొడ్బు బియ్యం తినేయాలని సూచించారు. రోజు నాన్ వెజ్ మానేయాలని వారానికి ఒక సారి 200 గ్రాముల మాంసం తినడం అలవాటు చేసుకోవాలన్నారు. సాయంత్రం ఏదో ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవాలని సూచించారు. ఫోన్ కూడా తక్కువగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలన్నారు. ఏసీలు మానేయాలని మీరంతా శ్రీకృష్ణ జన్మ స్థానానికి వెళ్లడం గ్యారంటీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed