సీఎం జగన్‌లా ప్రధాని ఓటు అడగలేకపోయారు..మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
సీఎం జగన్‌లా ప్రధాని ఓటు అడగలేకపోయారు..మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎవరికి వారే గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై జూన్ 4వ తేదీన క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీ పై చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఘాటుగా స్పందించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలకు దిగారు. ఆయనతో వన్ టైమ్ వ్యవహారం అనుకొని..తర్వాత వదిలేసినట్లు చెప్పారు. ప్రశాంత్ అయినా..ఐ-ప్యాక్ అయినా తాత్కాలికమేనని తెలిపారు. వైసీపీ శాశ్వతమని..ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 వైసీపీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పరిపాలన చూసి ఓటెయ్యాలని సీఎం జగన్‌లా ప్రధాని మోడీ కూడా ఓటు అడగలేక పోయారని అన్నారు.



Next Story